‘మైండ్ బ్లాక్’ సాంగ్ వచ్చేసింది !

సూపర్ స్టార్ మహేష్ బాబు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సింది. ఇప్పుడు ఆయన పాట విన్న మైండ్ బ్లాక్ కావాల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఆయనకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా నుంచి ‘మైండ్ బ్లాక్’ని విడుదల చేసింది చిత్రబృందం. నిజంగా ఈ పాటని వింటే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. డప్పుదరువులు, మధ్యలో మహేష్ డైలాగ్స్ అదిరిపోయాయ్. మాస్ అండ్ రొమాంటిక్ ఫ్లేవర్ తో కూడిన ఈ మాస్ సాంగ్ అదిరిపోయింది. ఈ పాటకి శ్రీమణి లిరిక్స్ అందించారు. బ్లాజీ, రాణియారెడ్డి కలిసి పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైండ్ బ్లాక్ సాంగ్ ని మీరు వినేయండీ.. !