ఖబర్దార్ పవన్‌.. రాజాసింగ్ వార్నింగ్ ! 

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. సోమవారం తిరుపతిలో పవన్ మాట్లాడుతూ.. హిందూ మతంపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలేనని, మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్‌ ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని ఆయన అన్నారు. అంతేకాదు.. టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైనది కాదు. లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన లేదు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని రాజాసింగ్‌ హెచ్చరించారు. హిందూమతం, ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా ? అని సూటిగా ప్రశ్నించారు.