దిశ కుటుంబాన్ని పరామర్శించిన మహేందర్ రెడ్డి

దిశ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వెటర్నరీ డాక్టర్ ని నలుగు క్రూరులు అతి దారుణంగా అత్యాచారం చేసి.. సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఆ నిందితులకి తక్షణమే ఉరిశిక్ష అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అందుకుతగ్గట్టుగా చట్టంలో మార్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు దిశ కుటుంబ సభ్యులని సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. బుధవారం మాజీ మంత్రి, ఎంఎల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంఎల్ఏ కాలే యాదయ్య లు దిశ కుటుంబ సభ్యులని పరామార్శించారు. దిశ తల్లిదండ్రులు, సోదరిని ఓదార్చారు. ఘటన తమను కలిచివేసిందని, అత్యంత బాధాకరమని మహేందర్ రెడ్డి అన్నారు. మహిళా సాధికారత, భద్రత కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి దుర్ఘటన లు చోటు చేసుకోవటం మరింత బాధాకరంగా ఉందని వాపోయారు.