మహేష్ థియేటర్ లో మెగా ఫ్యామిలీ సందడి !

సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన ‘ఏఎంబీ’ మాల్ లో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. మంగళవారం మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒకచోట చేరారు. ఏఎంబీ థియేటర్ కి వెళ్లి సినిమా చూశారు.మహేష్ మాల్ లో ఫోటోలకి పోజులిచ్చారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ ఆయ‌న భార్య స్నేహా రెడ్డి, అల్లు శిరీష్‌, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్,బ‌న్నీ సోద‌రుడు అల్లు బాబి, మెగా హీరోయిన్ నిహారికి, చిరు కుమార్తెలు శ్రీజ‌, సుస్మిత‌, చిరు చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌తో పాటు ప‌లువురు కుటుంబ స‌భ్యులు ఎఏంబీని సందర్శించిన వారిలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ గ్యాంగ్ లో మిస్సయ్యాడు. అన్నట్టు.. ఎఏంబీ మాల్ తరహా అల్లు అర్జున్ ఓ థియేటర్ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయితేజ్ ‘ప్రతిరోజూ పండగే’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ దేవ్ రెండో సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే యేడాది జనవరి నుంచి మొదలు కానుంది. నిహారిక ఎప్పటిలాగే వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. మరోవైపు, ఆమెకి పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంచి కుర్రాడి కోసం మెగా ఫ్యామిలీ వెతుకుతుంది.