పండగ ట్రైలర్ తెచ్చిన పెద్ద డౌట్లు !

మారుతి దర్శకత్వంలో సాయి తేజ్-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. తాత-మనవళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. సాయి తేజ్ తాతగా సత్యరాజ్ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఐతే, ట్రైలర్ ని చూస్తే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ‘భలే భలే మగాడివోయ్’ రేంజ్ లో వినోదం ఉండబోతుందని అర్థమవుతోంది.

అదే సమయంలో బోలేడు డౌట్లు కూడా వస్తున్నాయి. సత్యరాజ్ కి క్యాన్సర్. అది కూడా లాస్ట్ స్టేజ్. విదేశాల్లో ఉన్న కొడుకులకి కబురుపెడితే వచ్చే పరిస్థితి కనిపించలేదు. దాంతో కుమిలిపోతున్న సత్యరాజ్ కి మనవడు సాయితేజ్ రూపంలో అండదండ కనిపించింది. జీవితంలో చేద్దామని చేయలేకపోయిన పనులు, చేద్దామనుకొన్న పనులు ఇప్పుడు చేద్దామని తాతని సంతోషం పెడతాడు మనవడు సాయితేజ్. ట్రైలర్ ని చూస్తే ఇదే అర్థమవుతోంది.

అదే సమయంలో ఇది శర్వానంద్ ‘శతమానం భవతి’ సినిమా లైన్ తో తెరకెక్కినట్టు కనిపిస్తోంది. నిజంగానే ఇది శతమానం భవతి సీక్వెల్ గా లేదంటే.. ట్విస్టులు ఉంటాయా ? అనేది సినిమా చూసి.. తెలుసుకోవాల్సిందే.