‘దర్బార్’ పాటల పండగ ఎప్పుడంటే ?

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘దర్బార్‌’. ఈ చిత్రంలో నయనతార, ప్రకాశ్‌రాజ్‌, నివేదా థామస్‌, యోగిబాబు, హరీష్‌ ఉత్తమన్‌, మనోబాలా, ఆనంద్‌రాజ్‌, శ్రీమన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. లైకా సంస్థ నిర్మించింది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న దర్భార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో దర్భార్ ప్రమోషన్స్ లో వేగం పెంచనుంది చిత్రబృందం. ఇందులో భాగంగా ఈ నెల 7న ఆడియో వేడుక నిర్వహించబోతుంది. ఇందుకు నెహ్రూ ఇండోర్‌ స్టేడియం వేదికకానుంది. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎస్పీబీ పాడిన ‘సుమ్మా కిళి..’ అనే పాటను కూడా విడుదల చేశారు. మరోవైపు ఇటీవలే డబ్బింగ్‌ ప్రక్రియను కూడా పూర్తి చేశారు రజనీకాంత్‌. దర్భార్ లో రజనీకాంత్ ని మురగదాస్ ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.