‘నాన్న కోరిక తీర్చిన వెంకీ’మామ ! 


‘మనం’ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ జ్ఝాపకం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి చిత్రమిది. అది కూడా ఫ్యామిలీ కలిసి చేసిన మల్టీస్టారర్. కొడుకు, మనవడు, కోడలు, మనవరాలు (సమంత) మనంలో భాగస్వామ్యం అయ్యారు. ‘మనం’ లాంటి సినిమా తీయాలని నిర్మాత రామానాయుడుకి కోరిక ఉండేదట. వెంకీ, రానా, నాగ చైతన్య కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని ఆశపడేవారట. దురదృష్టవశాత్తు రామనాయుడు కోరిక బతికి ఉండగా తీరలేదు.

ఐతే, ఇప్పుడు వెంకీమామతో నాన్న కోరిక తీర్చా. నాన్న కోసమే ఈ సినిమా చేశానని వెంకటేష్ తెలిపారు. వెంకీ, ఆయన తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘వెంకీమామ’. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్  కథానాయికలు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకుడు. డి.సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ నిర్మాతలు. ఈ నెల 13న చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ..  “మామాఅల్లుళ్ల కథను బాబీ చెప్పడమే గొప్ప విషయం. మంచి భావోద్వేగాలతో, ప్రతి ఘట్టాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడు. నాగచైతన్య ఇందులోఆల్ రౌండర్ గా మంచి అభినయం ప్రదర్శించారు. అన్ని వాణిజ్యాంశాలున్న ఈ చిత్రం అందరికీ వినోదం పంచుతుంది” అన్నారు.