ఉప్పల్’లో టీ20 టీమిండియా టార్గెట్ 208


హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో విండీస్‌ భారీ స్కోర్‌ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విన్‌ లెవిస్‌(40; 17 బంతుల్లో, 3×4, 4×6), బ్రాండన్‌ కింగ్‌(31; 23 బంతుల్లో 3×4, 1×6), హెట్మేయర్‌(56; 41 బంతుల్లో 2×4, 4×6), కెప్టెన్‌ పొలార్డ్‌ (37; 19 బంతుల్లో 1×4, 4×6) రాణించారు. ఆఖర్లో.. జేసన్‌ హోల్డర్‌ (24; 9 బంతుల్లో 1×4, 2×6), దినేశ్‌ రామ్‌దిన్‌(11; 7 బంతుల్లో 1×4) చెలరేగి ఆడారు. దీంతో విండీస్ 208పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచగలిగింది.

ఇక 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 8పరుగుల వద్ద khary pierre బౌలింగ్ లో shimronకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం కె ఎల్ రాహుల్ (18), కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) క్రీజులో ఉన్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ గల టీమిండియా 208 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తుందేమో చూడాలి.