పవన్ చేసిన మోసాన్ని బయటపెట్టిన పూనమ్.. !

హీరోయిన్ పూనమ్ కౌర్ తరచూ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ ట్విట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ పూనమ్ పవన్ పై ఎందుకు పడిపోతుంది ? వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటీ ?? అన్నది పెద్ద ప్రశ్నగా ఉండేది. ఇంతకీ పూనమ్ కి పవన్ చేసిన మోసం ఏంటీ ? అన్నది సమాధానం దొరకని ప్రశ్నగా ఉండేది. ఇప్పుడు దానిపై పూనమ్ స్పందించింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలు హర్షం వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌ పై పూనమ్ కూడా సంతోషం వ్యక్తం చేసింది. నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. దిశ ఘటన తనలో ఎంతో ఆవేదనను, ఆందోళనను నింపిందని పేర్కొంది. నిందితులకు ఇంత త్వరగా శిక్ష పడినందుకు సంతోషంగా ఉందని, ఇలాంటి దుర్మార్గులకు అదే సరైన శిక్ష అని పూనమ్ పేర్కొంది. అదే సమయంలో… ఈ ఘటనని పవన్ కి లింక్ చేసింది.

 తనతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నానని పూనమ్ మరో ట్విట్ చేసింది. వాళ్లకి కూడా ‘ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు’ అని పేర్కొంది. దీంతో పూనమ్ తో పాటుగా పలువురిని మోసం చేసింది పవన్ కల్యాణ్ అనే విషయం క్లారిటీ ఇచ్చింది. దిశ ఘటనపై స్పందించిన పవన్ నిందితులకి బహిరంగంగా రెండు బెత్తం దెబ్బలు చాలని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాటలతో పూనమ్ సటైర్ వేసింది.
 
మొత్తానికి.. పవన్ తనని మోసం చేశాడని పూనమ్ క్లారిటీ ఇచ్చినట్టయింది. పూనమ్ తన ట్విట్ ని తొలగించిన అది అప్పటికే వైరల్ అయింది. ఇంతకీ పూనమ్ ని పవన్ శారీరకంగా వాడుకొన్నాడా.. ? లేక పెళ్లి చేసుకొంటానని ఆశలు పెట్టి మొహం చాటేశాడా ? అన్నది కూడా పూనమ్ నే చెబితే బాగుంటుందేమో. ఇక శ్రీరెడ్డి కూడా దిశ నిందితులని మాదిరిగానే పవన్ ని ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరీ.. ఆమెకి పవన్ చేసిన అన్యాయం ఏంటో.. ? చెబితే బాగుండునేమో.. !