ఎంపీ, ఎమ్మెల్యేల కొడుకులని కూడా ఇలాగే ఎన్‌కౌంటర్‌ చేస్తారా ?


దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌’పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ పోలీసులు గొప్పపని చేశారు. నిందితులకి తగినశాస్త్రీ జరిగింది. ఇప్పుడు దిశకు న్యాయం జరిగింది. ఆమె ఆత్మశాంతించిందని చెప్పుకొంటున్నారు. అది నిజమే. కానీ, ఇలాంటి కేసుల్లో ఉన్న రాజకీయ నేతల కొడుకులని ఇలాగే ఎన్‌కౌంటర్‌ చేయగలరా ? ఇప్పుదిదే ప్రశ్నని సూటిగా అడుగుతోంది రేపిస్ట్ చెన్నకేశవులు భార్య రేణుక. దేశంలో ఎన్నో దారుణాలు, ఘోరాలు జరిగాయి. అందులో ఎంపీ, ఎమ్మెల్యేల కొడుకుల ప్రమేయం ఉంది. వారిని ఇలాగే ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయడం లేదన్నది ఆమె వాదన. చెన్నెకేశవులు చేసిన పాపంతో జీవితంలో రేణుక ఒంటరిదైంది.

రేణుక చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయారు. చెన్నెకేశవులుని ప్రేమించిపెళ్లి చేసుకొంది. దాంతో అత్తారింటి నుంచి ఆమెకి పెద్దగా సహకారం లేదు. పైగా చాలా పేద కుటుంబం. రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబం. ప్రస్తుతం రేణుక గర్భవతి కూడా. ఈ నేపథ్యంలో తనని కూడా భర్తని ఎన్‌కౌంటర్‌ చేసిన చోటే కాల్చేయండని వేడుకుంటుంది. అలాగని చెన్నకేశవులు చేసిన ఘోరాన్ని ఎవరు సమర్థించడం లేదు. ఆయన చేసిన పాపానికి అతని భార్య రేణుక అనుభవించాల్సిన పరిస్థితి. మొత్తం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలో రేణుక జీవితమే కొంచెం ఎమోషన్స్ ని టచ్ చేస్తోంది. మిగితా ఏ విషయంలోనూ ఆ వెలితి లేదు.