అబ్బో.. టిక్ టాక్ పిచ్చి ముదిరినట్టుంది.. !

హీరోయిన్ రాశీఖన్నా నుంచి వారం రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల 13న ‘వెంకీమామ’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో నాగచైతన్యకి జంటగా నటించింది రాశీఖన్నా, వెంకీకి జంటగా పాయల్ రాజ్ పుత్ నటించింది. ఇక డిసెంబర్ 20న ‘ప్రతిరోజూ పండగే’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో సాయితేజు-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రమిది. ఇందులో రాశీఖన్నా టిక్ టాక్ సెలబ్రేటీగా కనిపించనుంది. 

ఇప్పుడీ టిక్ టాక్ పిచ్చిని వెంకీమామ టీమ్ తో కలిసి ఉన్నప్పుడు కూడా చూపిస్తోంది. ఈ సాయంత్రం ఖమ్మంలో వెంకీమామ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెంకీమామ చిత్రబృందం బస్సులో బయలు దేరి ఖమ్మం వెళ్లింది. బస్సులో వెళ్తుండగా రాశీఖన్నా మరో హీరోయిన్ పాయల్ తో కలిసి టిక్ టాక్ వీడియో చేసింది. ఇందులో ఆఖరులో చైతూకూడా తలదూర్చారు. ఇప్పుడీ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.