ఇదే కదా.. కావాల్సింది !

ఈ పిక్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కడుపు నింపేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13యేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇది. ఈ నేపథ్యంలో సరిలేరు కోసం ఆమె ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మహేష్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ అంతా మహేష్-విజయశాంతి కాంబోలో వచ్చే సీన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే, సినిమా రిలీజ్ కంటే ముందే వారి కోరిక తీరనుంది. ‘మండేస్ మహేష్’ పేరుతో డిసెంబర్ నెలలో వచ్చే ప్రతి సోమవారం సరిలేరు నుంచి ఒక్కోసాంగ్ ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు సరిలేరు నుంచి సూర్యుడివో.. చంద్రుడివో సాంగ్ రానుంది.

ఈ సాంగ్ లో మహేష్, విజయశాంతి, రష్మిక, రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. తాజాగా, మహేష్-విజయశాంతి పిక్ ఒకటి చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఇద్దరు సూపర్ స్టార్స్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది.