యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామిని దర్శకున్న గవర్నర్  

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ యాదాద్రికి విచ్చేశారు. ఈ ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ యాదాద్రికి రావడం ఇదే తొలిసారి. దర్శనం అనంతరం మంత్రి  జగదీశ్ రెడ్డి  యాదాద్రి పునర్నిర్మాణ పనులను గవర్నర్‌కు వివరించారు.

గవర్నర్ దంపతులు మధ్యాహ్నం వరంగల్‌ నగరానికి చేరుకొంటారు. అక్కడ కాకతీయుల కోటలోని చారిత్రక కట్టడాలను పరిశీలిస్తారు. తమిళిసై తెలంగాణ గవర్నర్ గా వచ్చాక.. పర్యటనలు చేయడం ఇదే మొదలు. ఈ నెల 10, 11 తేదీల్లో గవర్నర్ పెద్దపల్లి జిలాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. దానికి సంబందించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది.