మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్’తో ఆ దర్శకుడి సినిమా !

టాలీవుడ్ టాప్ స్టార్స్ ని లైన్ లో పెట్టాడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా ఉండనుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ చెప్పిన కథని మహేష్ ఓకే చేశాడు. ఇక మహేష్ సినిమా పూర్తయిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉండనుంది.

మహేష్, ఎన్టీఆర్’తోనే ప్రశాంత్ నీల్ సరిపెట్టుకోలేదు. బాహుబలి ప్రభాస్ ని కూడా లైన్ లో పెట్టేశాడు. మహేష్ తో స్టార్ట్ చేసి ప్రభాస్ తో ముగించబోతున్నాడు అన్నమాట. ఈ ముగ్గురు హీరోలకి ప్రశాంత్ నీల్ ఇప్పటికే కథ చెప్పేసి.. ఓకే చెప్పించుకోవడం విశేషం. అంతేకాదు.. ఈ మూడు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తెలుగులో తొలి సినిమా 2020 డిసెంబర్ నాటికి కానీ ప్రారంభం కాదని తెలుస్తోంది. ఈలోపు మహేష్ వంశీపైడి పల్లి సినిమాని పూర్తి చేయనున్నాడు.

ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నారు. దాదాపు షూటింగ్ పూర్తికావొస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’తో బిజీగా ఉన్నారు. వచ్చే యేడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కానుంది. ఇక, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి రాథాకృష్ణ దర్శకుడు.