పండగ టీం బస్ యాత్ర.. సూపర్ హిట్ !

‘చిత్రలహరి’ తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు మెగా యంగ్ హీరో సాయితేజ్. ఆయన తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయిక. మారుతి దర్శకత్వం వహించారు. చివరి రోజుల్లో తాతని ఫ్యామిలీ పట్టించుకోకపోతే.. ఆయన కోసం మనవడు ఏం చేశాడనేదే ఈ చిత్ర కథ. తేజు తాతగా సత్యరాజ్ నటించారు. ఈ నెల 20న ప్రతిరోజూ పండగే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాప్రమోషన్స్ లో భాగంగా పండగ టీం బస్ యాత్రని చేపట్టింది. 

మంగళవారం కాకినాడ, రామచంద్రాపురం, మండపేటలో పర్యటించింది. పండగ టీం బస్ యాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.  వరుస పరాజయాలు ఎదురైనప్పుడు చాలా తప్పులు చేశా. ఇకపై ఆ తప్పులు రిపీట్ చేయకూడదని అనుకుంటున్నా అన్నారు తేజు. ఇక తేజు పనైపోయింది అన్నవారు ఉన్నారు. భుజం తట్టి ప్రోత్సహించిన వారు కూడా ఉన్నారు. ప్లాపులకి పూర్తి బాధ్యత నాదే అన్నారు తేజు. ఇకపై మంచి చిత్రాలతో అలరిస్తానని మాటిచ్చారు.