రస్మికని పట్టించుకోవడం లేదు

హీరోయిన్ రష్మిక మందనకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రస్మికకి అన్యాయం చేసింది ఎవరు ? అంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పుకొంటున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రస్మిక మహేష్ కి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, రస్మికని మహేష్ సరిగ్గా వాడుకోవడం లేదట.
 
వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని దసరా నుంచే మొదలెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, రెండు పాటలు వచ్చేశాయి. ఐతే, వీటిలో రస్మికకి స్థానం లేకపోవడం విచారకరం. సినిమాలో రష్మిక ఉందన్న మాటే తప్ప ఇంతవరకు ఆమెకు సంబందించిన ఎలాంటి అప్డేట్ లీక్ చేయలేదు. అప్పుడెప్పుడో ఒక పోస్టర్ వదిలారు అంతే. టీజర్ లో ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు.  

సోమవారం రిలీజ్ చేసిన సరిలేరు రెండో పాట ‘సూర్యుడివో.. చంద్రుడివో’ పాటలోనూ రస్మిక కనిపించలేదు. అంతకుముందే సాంగ్ పోస్టర్స్ లో రస్మిక కనిపించింది. కానీ సాంగ్ లో ఆమె కనిపించలేదు. దీంతో.. ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరీ.. రస్మికకి సరిలేరు చిత్రబృందం ఏ రకంగా న్యాయం చేస్తారన్నది చూడాలి. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.