సీఎం కేసీఆర్ గజ్వేల్ పర్యటన డీటేల్స్ 


ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ములుగులో అటవీ కళాశాల, ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెడ్ యార్డ్, ఐవోసీ, ఆడిటోరియాన్ని సీఎం ప్రారంభిస్తారు. అలాగే.. రూ.100 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.32 కోట్లతో మాతా శిశు సంరక్షణ దవాఖాన పనులకు శంకుస్థాపన చేస్తారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగిసిన తర్వాత గజ్వేల్ ఆడిటోరియంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం నియోజకవర్గ స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. గజ్వేల్ నియోకజవర్గాన్ని సీఎం కేసీఆర్ మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.