దొంగ ‘అతడు’లా కనిపిస్తున్నాడు

ఈ యేడాది ‘ఖైదీ’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కార్తీ. ఆయన తాజా చిత్రం ‘తంబి’ తెలుగులో ‘దొంగ’ వస్తున్నాడు. కార్తీ, ఆయన వదిన జ్యోతిక కలిసి నటించిన చిత్రమిది. మలయాళ ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న దొంగ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తాజగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు ‘అతడు’ సినిమా లక్షణాలు కనిపించాయి. చిన్నప్పుడే ఇంటిని వదిలేసి వెళ్లిన తప్పుడు.. దాదాపు 15 యేళ్ల తర్వాత తిరిగొచ్చిన కథతో.. అక్కా-తముళ్ల అనుబంధం నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. ఐతే, వచ్చింది తన సొంత తమ్ముడేనా అనే అనుమానాలని ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ చివరలో ఒక అక్క.. ఇద్దరు అమ్మలతో సమానం అని కార్తీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకొంది.