చిరు-పవన్’లని ప్లాన్ ప్రకారం విడదీసింది.. ఆ మంత్రియే.. !

మెగా ఫ్యామిలీలో మళ్లీ విబేధాలు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో, ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి విడపోయారనే వార్తలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి బలమైన కారణాలని కూడా చూపుతున్నారు. కాకినాడలో పవన్ కల్యాణ్ దీక్షకు దిగిన రోజే… దిశ చట్టం తీసుకొచ్చిన సీఎం జగన్‌ను అభినందిస్తూ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చిరు-పవన్ మరోసారి విడిపోయారు అనే వార్తలు చక్కలు కొడుతున్నారు. ఐతే, మెగా బ్రదర్స్ విడిపోవడం వెనక ఏపీ మంత్రి ఒకరు కీలక పాత్ర పోషించారట.

‘సైరా’ సినిమా రిలీజ్ టైంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అమరావతికి వెళ్లి సీఎం జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వెనక మంత్రి కన్నబాబు కీలక పాత్ర పోషించారట. కన్నబాబు చిరు సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. సైరా సినిమాకు ఏపీలో స్పెషల్ షోలకు కూడా ఆయనే జగన్‌ను ఒప్పించి పర్మిషన్ ఇప్పించారనే ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలోనే.. చిరు-పవన్ విడిపోవడం వెనక కన్నబాబు కీలక పాత్ర పోషించారని.. ఇది పక్కా పొలిటికల్ ప్లాన్ అని రాజకీవర్గాల్లో చర్చ సాగుతోంది.