అమరావతి మార్పుపై ప్రభుత్వం ప్రకటన

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజధాని మార్పుపై రచ్చ మొదలైంది. ఆ తర్వాత అమరావతి అంశంపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికలో ఏముంది ? నిజంగానే రాజధానిని మారుస్తారా ? మారుస్తే ఎక్కడికి తరలిస్తారు ?? అనే సందేహాలు నెలకొన్నాయి.
 
దీనిపై శుక్రవారం శాసనమండలిలో తెదేపా ఎమ్మెల్సీలు ప్రశ్నలు అడిగారు. రాజధానిని మార్చే ఉద్దేశం ఉందా? అమరావతి కోసం ఇప్పటి వరకు ఖర్చుచేసిన నిధుల వివరాలేంటి ? అని ప్రశ్నించారు. దానికి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాత పూర్వక సమాధానం చెప్పారు. ‘లేదండి’.. అని తన సమాధాన పత్రంలో పేర్కొన్నారు. దీంతో.. రాజధాని అమరావతిని మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని క్లారిటీ వచ్చినట్టయింది.