‘ఘోస్ట్ స్టోరీస్’ ట్రైలర్ వచ్చేసింది !

బాలీవుడ్ లో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కరణ్ జోహార్- జోయా అక్తర్- అనురాగ్ కశ్యప్-దిబాకర్ బెనర్జీ.. ఈ నలుగురు  దర్శకులు చేస్తున్న మరో ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్”. నెట్ ఫిక్స్  లో జనవరి ఒకటి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా “ఘోస్ట్ స్టోరీస్”  ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం భయం.. దెయ్యం చేష్టలు.. భీభత్సానికి సంబంధించిన మూవ్ మెంట్స్ తో రక్తి కట్టించింది. సమీరా అనే నర్స్ పాత్రలో జాన్వీ, గర్భిణిగా గూఢచారి ఫేం శోభిత ధూలిపాళ, కొత్తగా పెళ్లయిన యువతిగా మృణాళ్ ఠాకూర్, పిల్లల తండ్రిగా దిబాకర్ బెనర్జీ నటించారు.