మణిరత్నం మల్టీస్టారర్ రెగ్యూలర్ షూటింగ్ షురు

మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ భారీ మల్టీస్టారర్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. కల్కి విరచిత పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కనుంది. ఈ మల్టీస్టారర్ లో విక్రం, కార్తి, జయంరవి, విక్రంప్రభు, రహమాన్, ఐశ్వర్యారాయ్, ఐశ్వర్యాలక్ష్మి, శరత్ కుమార్, ప్రభు, జయరామ్, అశ్విన్, కిశోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రెండు నెలలకు పైగానే ప్రీ-ప్రొడక్షన్ పనులు జరిగిన ఈ మల్టీస్టారర్ రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది.

బ్యాంకాక్ లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానరుపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిరత్నం సారథ్యంలోని మెడ్రాస్ టాకీస్ కూడా నిర్మిస్తోంది. కుమరవేల్ తో కలిసి స్క్రీన్ ప్లే సమకూర్చారు మణిరత్నం. మాటలు జయమోహన్ రాశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.