రాజశేఖర్ కూతుళ్లపై కన్నేసిన బాలయ్య


సీనియర్ హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివాని, శివాత్మిక హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిన్నకూతురు శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో ఎంట్రీ ఇచ్చేసింది. శివానీ ఎంట్రీ సినిమా ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఐతే, వీరిద్దరిపై నటసింహం బాలయ్య కనేశారట. ఈ విషయాన్ని స్వయంగా జీవితరాజశేఖర్ బయటపెట్టింది. శనివారం బాలయ్య రూలర్ ప్రీ రిలీజ్ వేడుక విశాఖలో ఘనంగా జరిగింది.

ఈ వేడుకకి జీవిత-రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య గొప్పతనం గురించి జీవిత, రాజశేఖర్ గొప్పగా చెప్పారు. అదే సమయంలో జీవిత ఆసక్తికర విషయాన్ని పంచుకొన్నారు. ఇటీవల జీవిత ఓసారి బాలయ్యని కలిసినప్పుడు.. మా ఇద్దరు కూతుళ్లని హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నామని చెప్పారట. 

దానికి సంతోషం వ్యక్తం చేసిన బాలయ్య.. మరీ నాతో ఎప్పుడు నటిస్తారు ? అనే సరదాగా అడిగారట. బాలయ్య కల్మషం లేని వ్యక్తం. ఆయన ఓపెన్ గా ఉంటారు. ఈ వయసులో ఎనర్జిటిక్ గా నటిస్తున్నారు. రూలర్ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్న జీవిత-రాజశేఖర్ చెప్పారు. కాకపోతే.. వీరిద్దరు బాలయ్య జపం ఎక్కువగా చేసినట్టు అనిపిఈంచింది.