చెన్నై వన్డే : టీమిండియా 216/5 (40 ఓవర్లు)

చెన్నై వేదికగా వెస్టీండీస్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి తొలి బ్యాటింగ్ చేస్తోంది. 40ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. ప్రసుతం క్రీజులో జాదవ్ 12, రవీంద్ర జడేజా 0 పరుగులతో ఉన్నారు. సీనియర్లు విఫలమైన వేళ యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్ (70), రిషబ్ పంత్ (71) పరుగులతో అదరగొట్టేశారు.
 
కె ఎల్ రాహుల్ (6), రోహిత్ శర్మ (36), విరాట్ కోహ్లీ (4) తక్కువ పరుగులకే అవుటైన అయ్యర్, పంట్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు. పంట్ తన సహజశైలికి భిన్నంగా క్రీజులో కుదురుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మ్యాచ్ పరిస్థితులని అర్థం చేసుకొని ఆటాడు. ఇంకా 10 ఓవర్లు మిగిలివుండటంతో.. జాదవ్, జడేజా రాణిస్టే.. టీమిండియా స్కోర్ 300 దాటే అవకాశాలున్నాయి.