లైవ్ : ‘ప్రతిరోజూ పండగే’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ 

మారుతి దర్శకత్వంలో సాయితేజు-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. చివరి రోజుల్లో తాతని ఫ్యామిలీ పట్టించుకోకపోతే.. ఆయన కోసం మనవడు ఏం చేశాడనేదే కథాంశంతో తెరకెక్కింది. తేజు తాతగా సత్యరాజ్ నటించారు. ఈ నెల 20న ప్రతిరోజూ పండగే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ మాదాపూర్ లోని ఐటీసీ కొహెనూర్ లో జరుగుతోంది. ఈ వేడుకకి మెగా అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. పండగ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి పండగకి ముందే వస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆనందం నెలకొంది. తాజాగా జరుగుతున్న పండగ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని మీరు లైవ్ లో చూసేయండీ.. !