లైవ్’లో పాట పాడిన రాశీఖన్నా

హీరోయిన్ రాశీఖన్నా మెగా అభిమానుల ముందు ఆగలేకపోయింది. స్టేజ్ పైకి ఎక్కేసి పాటపాడేసింది. మారుతి దర్శకత్వంలో సాయితేజు-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతోంది.

ఈ వేదికపై రాశీఖన్నా పాట పాడటం హైలైట్ గా నిలిచింది. గాయకుడు సాత్విక్ తో కలిసి రాశీఖన్నా ‘కనులనే.. ‘ అంటూ సాగే పాటని పాడింది. చాలా అద్భుతంగా పాడింది రాశీఖన్నా. మొదట్లో గ్లామర్ పాత్రలకే పరితమైన రాశీ.. తొలిప్రేమ నుంచి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలని ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. తన పాత్రలకి రాశీ సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. తాజాగా లైవ్ లో రాశీ పాడిన పాటని మీరు చూసేయండీ.. !