ఫ్యాన్స్ కోసమే సిక్స్ ప్యాక్ : తేజు

మెగా యంగ్ హీరో సాయి తేజు పడి లేచిన కెరాటం. వరుస ప్లాపుల తర్వాత ‘చిత్రలహరి’తో హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు. ఆయన తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. గీతాఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 20 ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాయితేజు మాట్లాడుతూ.. అభిమానుల కోసమే సిక్స్ ప్యాక్ చేశానన్నారు. సినిమాలో రెండు ఫైట్స్ లో సిక్స్ ప్యాక్ తో కనబడతా. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సిక్స్ ప్యాక్ అవసరం లేదన్నారు దర్శకుడు మారుతి. కానీ, అభిమానుల కోసమే కొత్తగా కనిపించాలని సిక్స్ ప్యాక్ చేశా. అభిమానులు అడిగారు. లావుగా అవుతున్నావు అన్నారు. అందుకే సిక్స్ ప్యాక్ చేశానని చెప్పారు.