సుమతో మారుతి బందర్ జ్ఝాపకం.. బాగుంది !

దర్శకుడు మారుతి యాంకర్ సుమతో ఉన్న బందర్ జ్ఝాపకాన్ని పంచుకొన్నారు. మారుతి దర్శకత్వంలో సాయితేజ్-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లో పండగ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని పండలా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి సుమ యాంకర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. సుమతో ఉన్న ఓ జ్ఝాపకాన్ని పంచుకొన్నారు. అది మారుతి పదో తరగతిలో ఉండగ బందరులో జరిగిన విషయం.

అప్పటికే సుమ యాంకర్ గా మంచి పేరుతెచ్చుకొన్నారు. బందురులో ‘చెప్పుకోండి చూద్దాం’ షో చేయడానికి వస్తే.. నేనే దగ్గరుండి తీసుకెళ్లా. ఆ విషయం ఆమెకి తెలీదు. సుమ వస్తుందంటే… రాత్రంతా నిద్రలేదు. ఆమె ఎలా రిసీవ్ చేసుకోవాలనే ఆలోచననే ఉంది. పొద్దినే లేచి పూలదండలు కొనుకొని.. రైల్వే స్టేషన్ కి వెళ్లి తీసుకొచ్చి అప్సర హోటల్ లో దించాను. అలాంటి సుమ ఇప్పుడు తన సినిమాకి యాంకరింగ్ చేయడం గొప్ప అనుభూతి అన్నారు. మారుతి బందర్ జ్ఝాపకం సుమని.. విన్నప్రేక్షకులని సైతం సప్రైజ్ చేసింది.