‘ప్రతిరోజూ పండగే’ సెన్సార్ రివ్యూ

మారుతి దర్శకత్వంలో సాయితేజ్-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని కితాబిచ్చినట్టు సమాచారమ్. తండ్రి-కొడుకుల ప్రేమని తెరపై అద్భుతంగా చూపించాడట మారుతి.

తాత-మనవళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయితేజు తాతగా సత్యరాజు నటించారు. వీరి కలయికలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయట. ఈ సినిమాలో తేజు కొత్తగా కనిపిస్తారు. సెటిల్డ్ గా నటించారని, టిక్ టాక్ క్వీన్ గా రాశీఖన్నా చేసే హంగామా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉందట. సినిమా మొత్తం పండగలా ఉంటుందట. థమన్ మరోసారి నేపథ్య సంగీతంతో మేజిక్ చేశాడన్నది సెన్సార్ టాక్.