ఎమ్మెల్యే భవానికి వేధింపులు

రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి వేధింపులు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని మంగళవారం ఆమె అసెంబ్లీలో హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. దిశ చట్టం అమలును తనతోనే మొదలుపెట్టాలని కోరారు.

మద్య నియంత్రణపై తాను సభలో మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అసత్యప్రచారం చేస్తున్నవారిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని.. దానికి సంబంధించి సాక్ష్యాలతో సహా స్పీకర్ కి అందజేస్తున్నట్టు తెలిపారు.

భవాని దివంగత టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు కుమార్తె. ఆమె టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు తనయుడ్ని వివాహమాడారు. ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని.. పార్టీకి, తమని నమ్ముకున్న ప్రజలకి సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని భవాని అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా తెలిపారు.