నటి పాయల్’కు బెయిల్ మంజూరు

మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రుపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన బాలీవుడ్ నటి పాయల్‌ రోహత్గీని రాజస్థాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పెట్టుకొన్న బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. ఈ నెల 24 వరకు పాయల్ ని కస్టడీకి అప్పగించింది. తాజాగా ఈ కేసులో పాయల్ కు బెయిల్ మంజూరైంది. రూ.25 వేల బాండ్ తో ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరవగా.. పాయల్ జైలు నుంచి విడుదలైంది.

నెహ్రు కుటుంబాన్ని దూషిస్తూ, జవహర్‌ లాల్‌ నెహ్రు సతీమణి గురించి అసభ్యకరంగా మాట్లాడిన  ఓ వీడియోను పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై యువజన కాంగ్రెస్‌ లీడర్‌ చర్మేశ్‌ శర్మ పాయల్ వీడియోపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో పాయల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.