నిర్మాతలని ఇబ్బంది పెడుతున్న పవన్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘పింక్’ రిమేక్ తో రీ-ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. ఐతే, ‘పింక్’ రిమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు ఇప్పటి వరకు పవన్ ప్రకటించలేదు. చిత్రబృందం కూడా పవన్ రీ ఎంట్రీలో పవన్ నటిస్తున్నారని నేరుగా చెప్పడం లేదు. దీనివెనక పవన్ అసంతృప్తియే కారణమని చెబుతున్నారు. పవన్ అనుమతి లేకుండానే చిత్రబృందం పింక్ రిమేక్ ని ప్రకటించారట. దీనిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం జరిగింది.

ఇష్టం లేకుండానే పవన్ పింక్ రిమేక్ కి ఓకే చెప్పినట్టున్నారు. ఈ సినిమా కోసం కేవలం 21రోజుల కాల్షీట్లు మాత్రమే ఇస్తాను. ఆ టైంలోనే తన పార్ట్ ని పూర్తి చేసుకోవాలని చెప్పారట. 21 రోజుల్లో షూటింగ్ పూర్తి అంటే కష్టమనే భావనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నివేధా థామస్ ని తీసుకొన్నారని తెలుస్తోంది.