అన్యమత ప్రచారం వెనక లోకేష్ ?

తెలుగు రాష్ట్రం ఏపీలో అన్యమత ప్రచారం ఎక్కువ సాగుతుందని.. ఏకంగా తిరుపతిలోనే బలవంతపు మతం మార్పిడిలు జరుగుతున్నాయనే విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మతమార్పిడిపై జనసేన అధినేత సీఎ జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అన్యమత ప్రచారనికి జగన్ ప్రభుత్వం మద్దతిస్తుందని ఆయన ఆరోపించారు. మంగళవారం ఏపీ శాసనమండలిలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది.

 ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి.. తిరుమలపై అన్యమత ప్రచారంలో లోకేశ్ హస్తం ఉందని ఆరోపించారు. అన్యమత ప్రచారంపై సోషల్ మీడియా దాడి వెనుక నారా లోకేశ్ హస్తం ఉందని మంత్రి  ఆరోపించారు. గూగుల్ లో పప్పు అని కొడితే లోకేశ్ పేరే వస్తోందని ఎద్దేవా చేశారు. వెల్లంపల్లి ఆరోపణలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆధారలు చూపాలని డిమాండ్ చేశారు. గూగుల్ లో 420, 6093 అని కూడా కొట్టి చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు.