రాశీఖన్నా పాడిన పండగ సాంగ్ విడుదల

యంగ్ హీరోయిన్ రాశీఖన్నా మంచి నటియే కాదు. మంచి సింగర్ కూడా. మెగా యంగ్ హీరో సాయితేజుకి జంటగా ఆమె నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ వారమే (డిసెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో చిత్రబృందం ఉంది. ఇందులో భాగంగా
“కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేసెనుగా .. కనుకేమో తలకిందులుగా పడి మది మది తిరిగెనుగా .. హైరానా పడిపోయా .. హాయిని వదిలిన ఎద వలన .. ఇంకొంచెం అడిగేశా తీయని హాయిని వద్దనక .. యూ ఆర్ మై హై” అంటూ సాగే యూత్ ఫుల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటని దీపుతో కలిసి రాశిఖన్నా పాడారు.

చివరి రోజుల్లో తాతని ఫ్యామిలీ పట్టించుకోకపోతే.. ఆయన కోసం మనవడు ఏం చేశాడనేదే కథాంశంతో తెరకెక్కింది. తేజు తాతగా సత్యరాజ్ నటించారు. పాజిటివ్ టాక్ తో పండగ సినిమాకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్ హక్కులు రూ. 17కోట్లకి అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.