హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ

హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణలో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు యూఎస్‌-ఇండియా డిఫెన్స్‌ ఒప్పందాలపై సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెం.1గా నిలిచింది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 5యేళ్లలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అమెజాన్‌ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. తెలంగాణ డిఫెన్స్‌ హబ్‌గా మారుతుంది. 12కు పైగా డిఫెన్స్‌ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. 25 ఏరోస్పేస్‌ సంస్థలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయి” అన్నారు.