సచిన్-జడేజా రికార్డ్ బ్రేక్ చేసిన పంత్-అయ్యర్

వన్డేల్లో ఒకే ఓవర్ లో టీమిండియా ఆటగాళ్లు రాబట్టిన అత్యధిక పరుగులు 28. 1999లో సచిన్‌ తెందూల్కర్‌, అజయ్‌ జడేజా కలిసి 28 పరుగులు సాధించారు. ఇప్పుడీ రికార్డు బద్దలైంది. బుధవారం చెన్నైలో విండీస్ తో జరిగిన మ్యాచ్ 47వ ఓవర్ లో పంత్, అయ్యర్ లు కలిసి  31 పరుగులు చేశారు. వన్డేల్లో ఒక ఓవర్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు ఇదే అత్యధిక స్కోరు.

47వ ఓవర్ లో తొలి బంతికి పంత్ సింగిల్ తీసి.. అయ్యర్ కి బ్యాటింగ్ ఇచ్చారు. ఇక ఓవర్ లో అయ్యర్ 6, 6, 4, 6, 6 లతో రెచ్చిపోయాడు. ఈ ఓవర్ లో మొత్తం 31 పరుగులొచ్చాయ్. పంత్‌, శ్రేయస్‌ 25 బంతుల్లో 18.25 రన్‌రేట్‌తో 73 పరుగులు చేశారు. దీంతో టీమిండియా విండీస్‌కు 388 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించగలిగింది.