నిశ్శబ్ధం : ‘నిన్నే నిన్నే.. ‘ ఫుల్ సాంగ్ వచ్చేసింది 

హేమంత్‌ మధుకర్ దర్శకత్వంలో స్వీటీ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అంజలి, సుబ్బరాజు, మాధవన్‌, షాలినీ పాండే, కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘నిన్నే నిన్నే.. ‘ ఫుల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటకి భాస్కర భట్ల లిరిక్స్ అందించారు. సిద్ శ్రీరామ్ పాడారు. గోపీ సుందర్ సంగీతం అందించారు.

అనుష్క-మాధవన్ పై ఈ సాంగ్ ని చిత్రీకరించారు. అందమైన లోకేషన్స్ లో ఈ సాంగ్ ని షూట్ చేశారు. సాంగ్ లోని కొన్ని బిట్ సీన్స్, కొన్ని మేకింగ్ సీన్స్, కొన్ని లొకేషన్స్ సీన్స్ తో లిరికల్ సాంగ్ ని వదిలారు. సాంగ్ చాలా బాగుంది. ట్యూన్ కొత్తగా ఉంది. పాటలో స్వీటీ అనుష్క-మాధవన్ ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని అనిపిస్తోంది.  

వచ్చే ఏడాది జనవరి 31న ‘నిశ్శబ్ధం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ నిశ్శబ్ధం ఫస్ట్ సింగిల్ ‘నిన్నే నిన్నే.. ‘ వినేసి ఎంజాయ్ చేయండీ.. !