కైరా షాకింగ్ నిర్ణయం

పేరు తెచ్చిపెట్టిన పాత్రల తరహా మరిన్ని పాత్రలు చేయాలని ఏ నటి, నటుడైనా కోరుకుంటారు. కానీ, హీరోయిన్ కైరా అడ్వానీ అందుకు భిన్నంగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ సంచలనం అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రిమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మాతృక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్-కైరా అద్వానీ జంటగా నటించారు.

ఈ సినిమా తర్వాత కైరా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె బిజీ హీరోయిన్ అయిపోయింది. అందురు ఆమె ప్రీతిగానే చూస్తున్నారు. ఇంతటి పేరు తెచ్చిన కబీర్ సింగ్ లాంటి సినిమాల్లో మళ్లీ నటించకూడదని కైరా నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇందుకు కబీర్ సింగ్ చిత్రంలో మహిళలని తక్కువ చేసి చూపించాడనే విమర్శలు రావడమే కారణం.

“కబీర్‌సింగ్ సినిమా నా జీవితాన్ని మలుపు తిప్పింది.  నాకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది. ఇటీవల చండీగఢ్‌లో ఓ కార్యక్రమానికి వెళితే అందరూ నన్ను `ప్రీతి.. ప్రీతి` అని పిలవడం ప్రారంభించారు. అది నాకెంతో స్పెషల్‌గా అనిపించింది. ఇక, ఆ సినిమాపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడాలంటే.. ప్రతీ ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. దానినే వాళ్లు చెప్పారు. నాలోనూ ఆ సినిమాపై రెండు రకాల అభిప్రాయలున్నాయి. ఒక నటిగా అది నాకు మర్చిపోలేని చిత్రం. కానీ, ఓ సగటు మనిషిగా మాత్రం `కబీర్‌సింగ్`లాంటి చిత్రాలను అంగీకరించనని, మరోసారి ఇలాంటి పాత్రల్లో నటించను” అని చెప్పింది.