సరిలేరు ఆథమ్ రికార్డింగ్ వీడియో చూశారా ?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించడానికి దేవి తీవ్రంగా శ్రమిస్తున్నట్టు వార్తలొచ్చాయ్. అది నిజమే అన్నట్టుగా.. తాజాగా సరిలేరు ఆథమ్ రికార్డింగ్ సెషన్ కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసింది చిత్రబృందం. యూరప్ లో ఈ సెషన్ నిర్వహించారు. 

ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకి జోడీగా రష్మిక మందన నటించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందు జనవరి 5న హైదాబాద్ ఎల్భీ నగర్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.