మహేష్’తో రస్మిక పనైపోయింది


సూపర్ స్టార్ మహేష్ తో రస్మిక పని చేసింది. మహేష్-రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇటీవల సరిలేరు షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ సినిమాకి సంబంధించిన అన్నీ పనులని రస్మిక పూర్తి చేసింది. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని కూడా చెప్పేసింది. ఆ వెంటనే రొమ్ కి చెక్కేసింది.

అక్కడ వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్-రస్మిక జంటగా నటిస్తున్న ‘భీష్మ’ సినిమా సాంగ్ ని షూట్ చేయనున్నారు. ఇక సరిలేరులో రస్మిక పాత్ర చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఆమె మహేష్ బాబు వెంటపడుతూ పాడే హీ ఈజ్ సో క్యూట్ సాంగ్ ఇటీవలే విడుదలైంది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 5న సరిలేరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక జనవరి 11న సరిలేరు సినిమా రిలీజ్ కానుంది.