పరశురామ్’పై బోలేడు ఫిర్యాదులు

‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ తో దర్శకుడు పరశురామ్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. అప్పటి వరకు చిన్న సినిమాలు చేసే పరశురామ్ కు స్టార్ హీరోల సినిమాల ఆఫర్లు వచ్చాయి. ఏకంగా మహేష్ తో పరశురామ్ సినిమా తెరపైకి వచ్చింది. ఐతే, కథతో మహేష్ ని మెప్పించలేకపోయాడు పరశురామ్. ఆ తర్వాత ప్రభాస్ ని కూడా ట్రై చేశాడు. అక్కడ వర్కవుట్ కాలేదు. దీంతో తిరిగి అప్పట్లో అనుకున్న నాగ చైతన్య సినిమాని ఖరారు చేశాడు.

ఇదంతా బాగానే ఉన్నా.. గీత గోవిందం సినిమాకి ముందు తర్వాత కూడా సినిమాలు చేస్తానని పలువురి దగ్గర పరశురామ్ అడ్వాన్సులు తీసుకున్నారట. ఈ లిస్టులో 14 రీల్స్, మైత్రీ మూవీస్ లాంటి బ్యానర్లు కూడా ఉన్నాయట. ఐతే, పరశురామ్ సాగదీత దోరణికి విసిగిపోయిన తమ అడ్వాన్సులని వెనక్కి తీసుకున్నారంట. పరశురామ్ బాధితుడిలో భోగవిల్లి ప్రసాద్ ఒకరని సమాచారమ్.

2008లోనే భోగపల్లి పరశురామ్ కి  పాతిక లక్షల అడ్వాన్సు ఇచ్చారు. గీతగోవిందం కన్నా ముందే సినిమా సంగతి గుర్తు చేస్తే, ఇదిగో అదిగో అంటూ గీతగోవిందం చేసారు పరుశురామ్. ఆ తరువాత అంటే మళ్లీ ఇదిగో అదిగో అంటున్నారు. తను ఇచ్చిన అడ్వాన్స్ ఇప్పుడు వడ్డీతో కలిపి ఆరు కోట్లు అయిందని, వెనక్కు ఇవ్వమని నిర్మాతల చాంబర్ ను ఆయన ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పరశురామ్ ఇమేజ్ డ్యామేజ్ అయినట్టే.