స్టార్ హీరోయిన్ అఖిల్ రొమాన్స్.. ఓ రేంజ్ లో ! 

అఖిల్ కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ని ఏరికోరి ఎంచుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకోసం ఫేమస్ హీరోయిన్ కావాలని చాలామందిని ప్రయత్నించారు. చివరికి అఖిల్ కి పూజా ఫర్ ఫెక్ట్ అంటూ ఆమెని తీసుకున్నారు. ఇప్పుడీ సినిమా జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఈ సినిమాలో అఖిల్ పూజాని బాగానే వాడేస్తున్నాడట. ఓ రేంజ్ లో రొమాన్స్ చేస్తున్నాడట. ఆ సన్నివేశాలని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ శ్రద్దగా తీస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం అఖిల్-పూజా రొమాన్స్ లో మునిగిపోయారు. వీరిపై హాట్ హాట్ రొమాంటిక్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక అఖిల్ నటించిన మూడు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ సినిమాపైనే అఖిల్ ఆశలు పెట్టుకొన్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తోంది. ఒకవేళ బడ్జెట్ చేయిదాటితే.. అది భరించడానికి నాగార్జున ఒప్పుకున్నారని.. అందుకే అఖిల్ కోసం గీతా ఆర్ట్స్ భారీగానే ఖర్చు పెడుతుందని సమాచారమ్.