ఈసారి బడా నిర్మాత ఆఫీసులో సోదాలు !

ఇటీవల హైదరాబాద్ లోని సినీ ప్రముఖుల ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేసినట్టు వార్తలొచ్చాయ్. ఈ లిస్టులో హీరోయిన్ లావణ్య త్రిపాఠి, యాంకర్స్ సుమ, అనసూయల పేర్లు వినిపించాయి. ఇద్దరు యాంకర్స్ తమ ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు. దీంతో ఆమె ఇంట్లో సోదాలు జరిగాయని తెలుస్తోంది. తాజాగా మరోసారి జీఎస్టీ అధికారులు  హైదరాబాద్ తో పాటు విశాఖ నగరంలోనూ సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్ , విశాఖపట్నంలోని 15 సంస్థలపై.. 23 కేంద్ర ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. హైదరాబాద్ లోని ఓ సినీ ప్రొడక్షన్ కార్యాలయంపై సోదాలు చేసారు. దాదాపు 60 లక్షల రూపాయల మేర పన్ను బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ సంస్థ.. తక్షణమే ఆ మొత్తాన్ని చెల్లించిందట. ఆ సంస్థ పేరు మాత్రం బయటికిరాలేదు.