రాజ‌మౌళి రివ్యూ : మత్తు వదలరా


ప్రముఖ సంగీత దర్శకుడు కీర‌వాణి ఇద్దరు తనయులు ఒకే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి చిన్నకొడుకు శ్రీ సింహా హీరోగా, పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రానికి రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వం వహించారు. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ముందే చెప్పినట్టు.. ఈ సినిమా చూసేందుకు దర్శకధీరుడు రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. మంగళవారం రాత్రియే మత్తు వదలరా సినిమా చూశారు జక్కన్న. వెంటనే సినిమాపై ఓ చిన్నపాటి రివ్యూని కూడా అందించారు. ట్విట్టర్ వేదికగా మత్తు వదలరా సినిమాపై రాజ‌మౌళి ప్రశంసలు కురిపించారు. ఇంతకీ రాజ‌మౌళి ఏమన్నారంటే.. ?

“గత రాత్రియే మత్తు వదలరా సినిమా చూశాను. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ‘మత్తు వదలరా’ మంచి వినోదాన్ని పంచింది. రితేష్ రానా మంచి టాలెంట్ ఉన్న వ్య‌క్తి. ఆయ‌న‌కి మంచి భ‌విష్య‌త్ ఉంటుంది. మా పిల్ల‌లు గురించి నేను ఎలా చెప్పుకోవాలి. సింహా, కాళ‌భైర‌వని చూసి చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నా. ద‌య చేసి సినిమాపై ఓ ఒపీనియ‌న్స్ షేర్ చేయండి. ఇవి వారికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయి. మైత్రి మూవీ మేక‌ర్స్‌, క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి నా శుభాకాంక్ష‌లు” అని రాజ‌మౌళి రాసుకొచ్చారు.