విశాఖకు రూ.394.50 కోట్ల నిధులు విడుదల

ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం మారనుంది. ఈ మేరకు ఇప్పటికే జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు కేబినేట్ భేటీ అనంతరం ప్రకటన చేయనున్నారు. ఇక ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారనున్న విశాఖకు తాజాగా ప్రభుత్వం భారీ నిధులని విడుదల చేసింది. విశాఖలో అభివృద్ధి పనులకు గానూ 7 జీవోల ద్వారా రూ. 394.50 కోట్ల నిధులను విడుదల చేసింది.

ఇందులో కైలాసగిరి ప్లానెటోరియం కోసం రూ. 37 కోట్లు, కాపులుప్పాడు బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ. 22.50 కోట్లు, సిరిపురం జంక్షన్ లో వాణిజ్య సముదాయం కోసం రూ.80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్ కోసం రూ. 88 కోట్లు, చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణం కోసం రూ. 90 కోట్లు, సమీకృత మ్యూజియం, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం రూ.40 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్డు నిర్మాణం కోసం రూ. 75 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.