మహేష్’తో ఫోటో షూట్.. డబ్బులు కూడా వసూలు చేశారట !


సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ డబ్బులి ఇచ్చి మరీ.. కొట్టించుకున్నట్టు అయింది. బుధవారం హైదరాబాద్ అల్యూమీనియం ఫ్యాక్టర్ లో ఫ్యాన్స్ తో మహేష్ బాబు ఫొటోషూట్ కార్యక్రమం రసాభసగా మారిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట జరిగి ఇద్దరి కాళ్లు విరిగాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాల్ని స్వయంగా మహేష్ అభిమానులే బయటపెట్టారు.

మహేష్ తో సెల్ఫీకి రూ. 500 రూపాయలు అంటూ వేదిక వద్ద డబ్బులు వసూలు చేసినట్టు చెబుతున్నారు. మహేష్ ను షార్ట్ కట్ లో కలిసే ఏర్పాటుచేస్తామంటూ ఏకంగా వెయ్యి రూపాయలు కూడా వసూలు చేశారట. ఐతే, ఈ వసూళ్ల వ్యవహారంతో యూనిట్ సభ్యులకి ఎలాంటి సంబంధం లేదు. కానీ, ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది ఇలా మోసపూరితంగా వ్యవహరించి.. అమాయకుల వద్ద 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేశారట.

ఇక ఈరోజు కూడా ఫ్యాన్స్ తో మహేష్ ఫోటో షూట్ కొనసాగుతోంది. ఐతే, నిన్నటిలా కాకుండా భద్రతని కట్టుదిట్టం చేశారు. నిన్న ఇచ్చిన పాస్ లని క్యాన్సిల్ చేసి.. కొత్త పాస్ లు ఇచ్చారు. ఎవ్వరికీ ఎలాంటి డబ్బు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి చర్యలేవే నిన్ననే తీసుకొని ఉంటే.. ఇద్దరు అభిమానుల కాళ్లు విరిగేవి కాదు కాదా.. !