మహేష్, విజయశాంతి.. సీరియస్ !

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 13యేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఆమె భారతి పాత్రలో కనిపించనున్నారు. భారతి పొలిటిషన్. ఆమెకు సాయం చేసే పాత్రలో మహేష్ కనిపిస్తారని.. వీరిద్దరి మధ్య సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయని చెబుతున్నారు.

తాజాగా సరిలేరు నుంచి ఫోటోని రిలీజ్ చేశారు. ఇందులో మహేష్, విజయశాంతి సీరియస్ గా కనిపిస్తున్నారు. ఒకే బెంచ్ చివర విజయశాంతి సీరియస్ గా కూర్చుని ఉండగా, అంతే సీరియస్ తో మహేశ్ మరో చివర కూర్చుని ఉన్నారు. వారి సీరియస్ లుక్ కి కారణమేంటీ ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 11న రిలీజ్ కానుంది.