నటి భర్త ఆత్మహత్య వెనక.. షాకింగ్ నిజాలు ! 

బుల్లితెర నటి, వ్యాఖ్యత రేఖ భర్త  గోపీనాథ్‌ (39) ఆత్మహత్య చేసుకున్నాడు. రేఖను గోపీనాథ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం రేఖ ఒక ప్రైవేట్‌ టీవీ ఛానల్‌లో పని చేస్తోంది. బుధవారం క్రిస్మస్ సెలవు రోజు కూడా ఆఫీస్ కు వెళ్లిన గోపీనాథ్ ఆఫీసులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఆత్మహత్య వెనక అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా గోపీనాథ్ అతని భార్య రేఖకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దానికి కారణం… గత ఆరు నెలల క్రితమే గోపీనాథ్‌ జేజే.నగర్‌లోని ఒక ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగానికి చేరినట్లు, అదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది.

ఈ విషయమై గోపీనాథ్‌కు రేఖకు మధ్య తరచూ గొడవలు జరిగేవని, గురువారం కూడా భార్యతో గొడవ పడి తన కార్యాలయానికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో తెలినట్టు సమాచారమ్. ఐతే, కేసుని నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.