రాజశేఖర్ కూతుళ్లు.. ఇలా రెచ్చిపోయారేంటీ.. ?


సీనియర్ హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మిక హీరోయిన్స్ గా రాణించాలని ఆశపడుతున్న సంగతి తెలిసిందే. ‘దొరసాని’ సినిమాతో శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేశారు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక శివానీ ఎంట్రీ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఐతే, వీరిద్దరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్నేహితులతో కలిసి సింగపూర్ వెళ్లారు.

అక్కడ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలని శివాత్మిక తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. సింగపూర్ లోని మరీనా బే సాండ్స్ రిసార్ట్స్‌లో బిల్డింగ్‌పై కట్టిన స్విమ్మింగ్ పూల్‌లో శివానీ, శివాత్మికలు బికినీలు వేసుకుని ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్స్.. రాజశేఖర్ కూతుళ్లు ఈ రేంజ్ లో రెచ్చిపోయారేంటీ ? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.