వారిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన యాంకర్ దీప్తి

తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని టీవీ9 యాంకర్ దీప్తి ఏపీ డీజీపీ సవాంగ్ ని కలిసి ఫిర్యాదు చేసింది. తాను అనని మాటలను అన్నట్టుగా పాత వీడియోలను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని.. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇటీవల అమరావతి మహిళా రైతులు యాంకర్ దీప్తిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. మహిళల వద్ద నుంచి రిపోర్టింగ్ చేస్తున్న దీప్తి, పెయిడ్ ఆర్టిస్టుల ఆందోళన అని వ్యాఖ్యానించిందని ఆరోపిస్తూ.. ఆమెపై దాడి చేశారు. తమ స్వగ్రామంలో తాము ధర్నా చేస్తుంటే, దీప్తి పెయిడ్ ఆర్టిస్టులని చెప్పడాన్ని పలువురు మహిళలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ దాడిలో నిరసనకారులు మీడియా వాహనాలనూ ధ్వంసం చేశారు.